

సివిల్ సర్వీసుల పరీక్షల్లో తెలంగాణ కుర్రాడు దురిశెట్టి అనుదీప్ ఆలిండియా మొదటి ర్యాంకు సాధించాడు. గతంలో ఇదే పరీక్షల్లో సాధారణ ర్యాంకుతో రెవెన్యూ సర్వీసుల్లో సహాయ కమిషనర్గా చేరిన ఇతను పట్టువదలని విక్రమార్కుడిలా మళ్లీ గట్టిగా ప్రయత్నించి దేశవ్యాప్తంగా అందరికంటే ముందు నిలిచాడు. తెలంగాణకే చెందిన కోయ శ్రీహర్ష సైతం ఆరోర్యాంకు సాధించాడు. మొత్తం 990 మందిని వివిధ సర్వీసులకు ఎంపిక చేసినట్లు బుధవారం యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీఎస్సీ) విడుదల చేసిన ఫలితాల్లో పేర్కొంది. అనుకుమారి, సచిన్ గుప్తా వరుసగా రెండు, మూడో ర్యాంకులు కైవసం చేసుకున్నారు. మహిళల్లో అగ్రగామిగా నిలిచిన కుమారి దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి భౌతికశాస్త్రంలో బీఎస్సీ(ఆనర్స్) పూర్తి చేశారు. నాగ్పుర్లోని ఐఎంటీ నుంచి ఎంబీయే(ఫైనాన్స్, మార్కెటింగ్) అభ్యసించారు. దివ్యాంగురాలైన సౌమ్యశర్మ తొమ్మిదో ర్యాంకు సాధించారు. తొలి 25 ర్యాం





No comments:
Post a Comment